Nidhhi Agarwal Juggles Between Two Big Budget Telugu Films

Nidhhi Agarwal: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నిధి అగర్వాల్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆమె నటిస్తున్న రెండు పాన్-ఇండియా తెలుగు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ తో “హరి హర వీర మల్లు,” రెండవది ప్రభాస్ తో “రాజా సాబ్”. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. జ్యోతి కృష్ణ “హరి హర వీర మల్లు”కి, మారుతి “రాజా సాబ్”కి దర్శకత్వం వహిస్తున్నారు.

Nidhhi Agarwal Juggles Between Two Big Budget Telugu Films

ఇటీవల, నిధి ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొని అభిమానులను ఆశ్చర్యపరిచింది. “హరి హర వీర మల్లు” షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో, “రాజా సాబ్” షూటింగ్ తెలంగాణలో జరిగాయి. ఒకే రోజు రెండు ప్రాజెక్ట్‌ల కోసం పని చేయడం ఆమె ప్రొఫెషనలిజం, అంకితభావాన్ని చూపిస్తుంది. ఈ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Also Read: Kanguva Promotions: జోరు పెంచిన సూర్య.. హిందీలో హుషారుగా కంగా ప్రమోషన్స్!!

సోషల్ మీడియా ద్వారా ఈ అనుభవాన్ని పంచుకుంటూ, రెండు చిత్రాల్లో నటించడం తనకు ఎంతగానో సంతోషాన్నిస్తోందని నిధి చెప్పింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సరసన నటించడం గొప్ప అవకాశమని, ఈ సినిమాలు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయని ధీమా వ్యక్తం చేసింది.

మారుతి దర్శకత్వం వహిస్తున్న “రాజా సాబ్” ఏప్రిల్ 10, 2025న, “హరి హర వీర మల్లు – పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్” మర్చి 28, 2025న విడుద కానున్నాయి. ఈ రెండు భారీ అంచనాలున్న సినిమాలపై మరిన్ని అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.