Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్ర ముప్పు.. టోర్నమెంట్ రద్దు?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు నేపథ్యంలో…. ఉగ్రవాదుల కన్ను పాకిస్తాన్ పైన పడింది. పాకిస్తాన్ దేశంలో ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ చాలా మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

A fierce threat Champions Trophy 2025
అయితే ఇలాంటి నేపథ్యంలోనే… పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు కొంతమంది… కొత్త కుట్రలకు తెర లేపారట. పాకిస్తాన్ దేశానికి వచ్చిన విదేశీ క్రికెట్ అభిమానులను కిడ్నాప్ చేసి… తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ విషయం పాకిస్తాన్ ప్రభుత్వానికి తాజాగా ఇంటలిజెన్స్ ద్వారా తెలిసింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పాకిస్తాన్ ప్రభుత్వం రంగంలోకి ఆర్మీ ని దించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ కి వచ్చిన… విదేశీ క్రికెట్ అభిమానులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటుంది.