Bandi Sanjay: మోదీపై బండి సంజయ్ పాట.. ప్రశంసల జల్లు.. బీజేపీ కార్యకర్తల హర్షం!!

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనలోని గాయకుడిని బయటపెట్టారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూ, ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసే సంజయ్… ఇప్పుడు తన గాత్రాన్ని ఉపయోగించి ఓ పాట పాడి ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాది క్రితం విడుదలైన ‘నమో.. నమో.. నరేంద్ర మోదీ’ పాటను ఓ రికార్డింగ్ స్టూడియోలో హుషారుగా ఆలపించారు.
Bandi Sanjay Sings Modi Devotional Song
‘నమో.. నమో.. నరేంద్ర మోదీ.. పలుకుతున్నది యువత నాడీ.. ప్రధానిగా తమరే కావాలని.. అంటున్నది మన భరతజాతి..’ అంటూ ఆయన పాడిన ఈ పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బండి సంజయ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఈ పాటను తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేస్తూ ఆయన గాత్రానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గతంలోనూ బండి సంజయ్ ఓ వేదికపై పాట పాడి అలరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంజయ్, తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం…’ అంటూ ఓ శ్రావ్యమైన పాటను ఆలపించి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు.
ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా గతేడాది శ్రీరామనవమి సందర్భంగా ‘హిందువుగా పుట్టాలి.. హిందువుగా బతకాలి.. హిందువుగా చావాలిరా’ అనే పాట పాడి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.