IPL 2025: ఓపెనింగ్ సెర్మనీకి దిశా పటానీ, శ్రద్ధా కపూర్ ?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. అయితే ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అభిమానులకు ఎలాంటి సమస్యలు లేకుండా దగ్గరుండి చూసుకుంటుంది.

IPL Disha Patani, Shraddha Kapoor for the opening ceremony
ఈనెల 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ కూడా నిర్వహించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈసారి మరింత గ్రాండ్ గా ఈ ఓపెనింగ్ సెర్మని వేడుకలు నిర్వహించేలా… రంగం సిద్ధం చేసింది ఐపిఎల్ యాజమాన్యం. IPL Disha Patani, Shraddha Kapoor for the opening ceremony
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 పది జట్ల కెప్టెన్స్ వీళ్లే ?
దీనికోసం బాలీవుడ్ భామలను కూడా రంగంలోకి దింపుతోంది. హీరోయిన్లు దిశాపటాని, శ్రద్ధ దాస్ అలాగే సింగర్స్ కరణ్, శ్రేయ ఘోషల్ లాంటి ప్రముఖులు రాబోతున్నారు. బాలీవుడ్ హీరోలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఈ వేడుకకు వెళ్లడం లేదు. కేవలం బాలీవుడ్ సినీ నటీనటులకే ప్రాధాన్యత లభిస్తుంది.
Also Read: Ipl 2025: ఇవాల్టి నుంచి విశాఖలో ఐపీఎల్ 2025 టికెట్లు !