
H5 bird flu: ప్రపంచ దేశాలను 2019-20 సంవత్సరాలలో కరోనా మహమ్మారి భయపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చాలా దేశాల్లో లాక్ డౌన్ కూడా విధించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఆ కరోనా మహమ్మారిని జయించిన అన్ని దేశాలు, ఇప్పుడు దూసుకు వెళ్తున్నాయి. అయితే కరోనా నుంచి కోరుకున్న ప్రపంచాన్ని ఇప్పుడు కొత్త రకం బర్డ్ ఫ్లూ భయపెట్టిస్తోంది. H5 బర్డ్ ఫ్లూ చాలా దేశాల్లో ప్రమాదకరంగా మారుతున్నట్లు చెబుతున్నారు. H5 bird flu
1st human case of H5 bird flu in US reported in Colo
ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తే కరోనా కంటే ప్రమాదకరంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని కూడా తరిమికొట్టవచ్చు అని చెబుతున్నారు. ఈ హెచ్ 5 బట్లు వైరస్… పక్షులు అలాగే కోళ్లను ఇప్పటికే నాశనం చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో జంతువులకు కూడా ఈ వైరస్ వస్తుందట. అలాగే లైట్ తీసుకుంటే మనుషులకు కూడా వ్యాపించే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రాన్స్ దేశానికి చెందిన ఇనిస్టిట్యూట్ పాశ్చర్ నిపుణురాలు డాక్టర్ మేరీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదకరమైన వైరస్ మనుషులకు సోకడానికి వీలుగా రూపాంతరం చెందితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. H5 bird flu
Also Read: Kavitha: కాంగ్రెస్, టీడీపీ పార్టీని కలుపుతున్న కవిత..రెండు చీరలు కట్టుకుని ?
ప్రస్తుతానికి అయితే భయపడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు చెబుతున్నారు. ఇప్పటినుంచి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు. కోడి మాంసం అలాగే కోడి గుడ్లను తినే ముందు బాగా ఉడికించాలని సూచనలు చేస్తున్నారు. పక్షులు లేదా జంతువులతో పనిచేసే వాళ్లు శుభ్రత పాటించాలని హెచ్చరిస్తున్నారు. పక్షులు, జంతువులకు ఈ వైరస్ సోకితే వాటికి దూరంగా ఉంటేనే మంచిది. ఇలా పైన పేర్కొన్న సూచనలు పాటిస్తే ఈ వైరస్ ను పుట్టుకలోనే భూస్థాపితం చేయవచ్చని చెబుతున్నారు వైద్యులు. H5 bird flu
Also Read: Kadiyam Srihari: కేసీఆర్ చనిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలే ?




















