
Chandrababu: చంద్రబాబు నాయుడు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారట. మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు తీసుకునేందుకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందట. కొత్త అప్పు కోసం ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టిన కూటమి ప్రభుత్వం..త్వరలోనే మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు తీసుకోనుందట. 18 నెలల్లోనే రూ.2.93 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ఏపీ ప్రభుత్వం..ఇప్పుడు కొత్త అప్పు తీసుకోనుంది. Chandrababu
Chandrababu Another 6,500 crore new debt
ఇది ఇలా ఉండగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూకబ్జాపై లోకాయుక్త కోర్టు సీరియస్ అయింది. 2016 మాజీ సైనికులకు ఇచ్చిన స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడట. సర్వే నంబర్ 8/1లో 2.92 ఎకరాలు కబ్జా చేశాడట టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. బి.కె.పల్లి గ్రామంలో చెరువు పోరంబోకు భూమి కబ్జా జరిగినట్లు నిర్ధారణ అయింది. ఫేక్ పట్టాతో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి, ఆయన భార్య సరళ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. Chandrababu
Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడకు చిక్కులు ?
అప్పటి తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓలు ఎమ్మెల్యేతో కుమ్మక్కైనట్లు కలెక్టర్ నివేదిక రెడీ చేశారట. సెలవు రోజైన ఆదివారం నాడు రికార్డులు మార్పు చేశారట. ఐదుగురు ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు గత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం కింద క్రిమినల్ కేసులకు ఆదేశాలు ఇచ్చారట. ప్రస్తుతం హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున లోకాయుక్తలో కేసు కొట్టివేసినట్లు సమాచారం. Chandrababu
Also Read: Jagan: కర్మకాలి జగన్ అధికారంలోకి వస్తే, కూరలో పసుపు వేయడానికి కూడా వణికిపోతారు ?





