Nagarjuna New Movie Targets Sankranthi

Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర అనే సినిమాతో బిజీగా ఉన్నారు. నా సామిరంగ సినిమాతో ఈ సంవత్సరం మొదటి నెలలోనే సక్సెస్ ను అందుకున్న నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా కుబేర చేస్తున్నాడు. వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న కుబేర సినిమాలో తమిళ హీరో ధనుష్ నటిస్తున్నాడు. అయితే వీరిలో ఎవరు హీరో పాత్ర అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇద్దరికీ సమానంగా ఉంటుందా లేదా ఎక్కువ తక్కువ ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా నాగార్జున కెరియర్లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కాగా ఇప్పటిదాకా ఆయన పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయలేదు.

Nagarjuna New Movie Targets Sankranthi

ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే నాగార్జున పాన్ ఇండియా సినిమాలు వరుసగా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు పాన్ ఇండియా పై దృష్టి పెట్టి అక్కడ వరుస సినిమాలు చేయబోతున్నారు. దీనిని సీరియస్ గా తీసుకుని ఆ విధంగా సినిమాలు చేయాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి కుబేర విజయాన్ని సాధించి నాగార్జునకు మంచి పేరు తీసుకురావడం చాలా ముఖ్యం. ఇకపోతే ఆయన సోలో సినిమా చేసి చాలా రోజులే అయింది అని చెప్పాలి.

Also Read: Jai Balayya: బాలయ్య ను వాడుకోవడం లో వారి తర్వాతే ఎవరైనా!!

ఇప్పుడు చేస్తున్న మల్టీస్టారర్ సినిమా తర్వాత ఆయన ఓ తమిళ దర్శకుడితో భారీ సినిమాను చేసేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఇదే సమయంలో బుల్లితెరలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కూడా మొదలు కాబోతుంది. బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్టు గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా త్వరలోనే మొదలు కాబోతున్న ఈ సీజన్ 8 ని పూర్తి చేసి నాగార్జున తన తదుపరి సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు.

నా సామి రంగ సినిమాను కూడా ఈ విధంగానే కేవలం మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి విడుదల చేశారు. ఆ విధంగానే ఈ సినిమాను మూడు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు నాగ్. మరి ఆ సినిమా మాదిరిగానే దీనికి సక్సెస్ దక్కుతుందా అనేది చూడాలి. ఏదేమైనా సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ పూర్తి చేసి అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో సినిమాను చేసి జనవరి లో సినిమా విడుదల చేస్తాడా అనేది చూడాలి.