Poonam kaur: యాక్టర్స్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలోనే మంచి పేరును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

Tollywood beauty Poonam kaur interesting post

పూనం కౌర్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మాయా జలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది బ్యూటీ. ఆ తరువాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నిరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట ఎంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది.

Also Read: Allu Arjun: బన్నీ ఇంట్లో వరలక్ష్మి శరత్ కుమార్.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

2022 లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ హార్ట్ బీట్ ఏముందో ఓ లుక్కేద్దాం పదండి. పూనమ్ కౌర్ తన ట్వీట్ లో రాస్తూ…కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే..ఒక యోధుడిగా ఓడిపోవటమే మేలు ‘అంటూ పోస్ట్ చేసింది.

Tollywood beauty Poonam kaur interesting post

ఇది చూసిన నెటిజెన్స్ ఏపీలో జరిగిన ఎన్నికలపై పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీ ఎంలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.(Poonam kaur)