Andhra Pradesh rains: ఈనెల 18 వరకు భారీ వర్షాలు – వాయుగుండం హెచ్చరిక!

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా ముదురుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇంకా పూర్తిస్థాయిలో బలపడకపోయినా, వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ వరకు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారితే తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాం‌శం ఉందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రాబోయే మూడు రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు ఈ వర్షాలు పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తక్కువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అధికారులను సంప్రదించాలని సూచనలు జారీ చేస్తున్నారు. ఈ వర్షాల ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Share your love