Pawan Kalyan mass warning to that hero

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో ఫేమస్ అయినటువంటి దేవుడికి ఇష్టమైన లడ్డు అపవిత్రం అయిందని, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు,చేప నూనె వంటివి కలపడంతో ఆ లడ్డు అపవిత్రం అవడంతో దీనిపైన దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు.

Pawan Kalyan mass warning to that hero

అయితే ప్రస్తుతం ఈ తిరుమల లడ్డుపై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తూ హిందువుల మనోభావాలతో ఆడుకోకండి అని మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈ లడ్డు విషయంలో ఓ హీరో పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు ఎందుకు పవన్ కళ్యాణ్ కి ఆయన కోపం తెప్పించారు అనేది ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఫైర్ అయింది ఎవరి మీదో కాదు కోలీవుడ్ నటుడు కార్తీ మీద.. (Pawan Kalyan)

Also Read: Sai Pallavi: అతన్ని పెళ్లి చేసుకుంటే నన్ను ఇంట్లోకి రానివ్వరు.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్.?

ఇక వీరి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది అంటే.. తాజాగా సత్యం సుందరం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటుడు కార్తీకి లడ్డుపై స్పందించమని ప్రశ్న ఎదురవగా అది సెన్సిటివ్ ఇష్యూ నేను దాని గురించి మాట్లాడను అంటూ సున్నితంగా ఆ ప్రశ్నను రిజెక్ట్ చేశారు. అంతేకాదు లడ్డు కావాలా నాయనా అంటూ ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో ఈ విషయంపై పవన్ ఫైర్ అయ్యారు.

Pawan Kalyan mass warning to that hero

ఓ హీరో తన సినిమా ఈవెంట్లో లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ అంటూ మాట్లాడారు.అలా ఇంకొకసారి మాట్లాడితే బాగోదు.నటుడుగా ఆయనంటే నాకు చాలా గౌరవం. కానీ లడ్డు మీద జోక్స్ వేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు.సనాతన ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోండి. నోట్లో నుండి ఏదైనా మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలా వద్దా అని మాట్లాడండి.అంతేకానీ ఇలా లడ్డు మీద జోక్స్ వేయకండి అంటూ నటుడు కార్తీ పేరు తీయకుండా ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.(Pawan Kalyan)