Lavanya: 300 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు.. హీరో నిఖిల్ తో పాటు ఆ ఓనర్..?
Lavanya: గత ఏడాది హీరో రాజ్ తరుణ్ ఆయన ప్రియురాలు లావణ్య కి సంబంధించిన కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఇందులో ఎన్నో విషయాలు మీడియా ముందు బయటపడ్డాయి. తన డబ్బులన్నీ నొక్కేసి తనను వదిలేసి మరో హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని రాజ్ తరుణ్ కి సంబంధించి ఎన్నో విషయాలు బయట పెట్టింది లావణ్య.అలాగే లావణ్య మంచిది కాదని, ఆమె డ్రగ్స్ కి బానిస అయిందని, వేరే వాళ్ళతో తిరుగుతుందని ఇలా ఎన్నో విషయాలు చెప్పారు రాజ్ తరుణ్.
Lavanya Sensational comments on Masthan sai
అలా వీరి విషయం సర్దుమనిగింది అనే సమయంలో సడన్గా మస్తాన్ సాయి పేరు తెరమీద వినిపించింది. మస్తాన్ సాయి వల్లే లావణ్య రాజ్ తరుణ్ విడిపోయారనే వార్తలు వినిపించాయి.అయితే తాజాగా మస్తాన్ సాయి లావణ్య కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. లావణ్య తాజాగా మీడియాకి మస్తాన్ సాయి కి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఆయన దాదాపు 300 మంది అమ్మాయిలను న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ ని పోలీసులకు అందజేసింది. (Lavanya)
Also Read: Mahesh Babu: అప్పుడే ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన రాజమౌళి!!
అయితే ఈ వీడియోలో ప్రముఖ హీరో నిఖిల్ కి సంబంధించింది కూడా ఉంది అని మీడియాలో ప్రచారం జరుగుతుంది.అలాగే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ కి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని బయటపెట్టారు. అలాగే మస్తాన్ సాయి ఎంతో మంది అమ్మాయిలు జీవితాలను నాశనం చేశారని,తనపై కూడా అత్యాచారం చేస్తూ ఆ వీడియో రికార్డ్ చేసి తన వీడియో తనకు ఇచ్చేయమని చెబితే తనపై దాడి చేసినట్టు లావణ్య తెలిపింది.
అలాగే లావణ్య దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ తనకి అప్పగించకపోతే చంపేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు పోలీసులకు చెప్పింది లావణ్య.ప్రస్తుతం ఈ కేసు మరోసారి సంచలనం సృష్టించింది. ఇప్పటికే మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి గతంలో డ్రగ్స్ కేసులో కూడా పట్టుబడ్డ సంగతి మనకు తెలిసిందే.(Lavanya)