adivi sesh and emraan hashmi

Emraan Hashmi: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, అడివి శేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా స్పై థ్రిల్లర్ ‘G2’ సెట్స్‌లో గాయపడటం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ ఘటనలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఇమ్రాన్ హష్మీకి మెడ కింద స్వల్ప గాయాలయ్యాయి. అయితే, అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు, ఎందుకంటే ఇమ్రాన్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.

Emraan Hashmi Injured on Sets of G2

సెట్‌లోనే ఇమ్రాన్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. డాక్టర్లు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో, ‘G2’ టీమ్‌ మరో షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనుంది. ఇమ్రాన్ హష్మీ త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొంటారని ఆశిద్దాం.

Also Read: Tanikella Bharani: తనికెళ్ల భరణికి బెదిరింపులు.. చంపేస్తానంటూ మెసేజ్ లు.?

2018లో విడుదలైన అడివి శేష్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న G2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, AK ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ తెలుగు చిత్రసీమలో తొలిసారి నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ ప్రమాదం సినిమా చిత్రీకరణలో ఎలాంటి అవాంతరం కలిగించదని టీమ్ నమ్మకంగా ఉంది.