Abhishek Sharma: అర్ధరాత్రి 3 గంటలకు అభిషేక్ శర్మ ఆ పనులు ?
Abhishek Sharma: ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20 లో 37 బంతుల్లో సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ శర్మ పేరు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. ముంబైలోని వాంకడే స్టేడియం వద్ద తుఫాను సృష్టించిన తర్వాత అభిషేక్ ఫిబ్రవరి 3న సాయంత్రం 4:11 గంటలకు ఢిల్లీకి చేరుకున్నాడు. అదేరోజు సాయంత్రం అతను ఢిల్లీ నుంచి తన ఇంటికి బయలుదేరాడు.

Abhishek Sharma Mid Night Parties
అక్కడ రాత్రంతా పార్టీ జరిగింది. అభిషేక్ సక్సెస్ పార్టీలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ డీజే బ్రావో ఛాంపియన్ ఛాంపియన్ అని చాలా సార్లు ప్లే చేశారు. అభిషేక్ శర్మ ఈ సమయంలో కేక్ కూడా కట్ చేశాడు. అభిషేక్ ఇలా చేస్తున్నప్పుడు రాత్రి 2: 56 నిమిషాలు అయింది. ఈ నిమిషంలో సక్సెస్ కేక్ కూడా కట్ చేశారు.
కేక్ కటింగ్ అనంతరం అభిషేక్ తన తల్లి నుంచి ఒక అద్భుతమైన బహుమతి కూడా అందుకున్నాడు. ఆ సమయానికి రాత్రి 2:57 నిమిషాలు అయింది. నేను బ్యాట్ ని మా అమ్మ దగ్గర నుంచి బహుమతిగా తీసుకున్నాను అంటూ అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. పార్టీ తర్వాత అభిషేక్ శర్మ కుటుంబం, స్నేహితులతో కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాడు.