Work From Home: చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిమోట్ వర్క్ ఛాన్స్!!

Work From Home: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) అవకాశాలను విస్తృతంగా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ఆధారంగా సర్వే నిర్వహించనుంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి, 18-50 సంవత్సరాల మధ్య ఉన్న వారి స్కిల్స్, విద్యా అర్హతలు, ఉద్యోగ స్థితి గురించి వివరాలు నమోదు చేస్తారు. ఈ సర్వే మార్చి 1 నుంచి 10 వరకు జరుగుతుంది.
Andhra Pradesh Work From Home Survey
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ప్రకటిస్తూ, “మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించడం మా ప్రాధాన్యత” అని తెలిపారు. అలాగే, “కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాము” అని వివరించారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను పెంచడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
సర్వే ద్వారా ప్రాంతాల్లో ప్రజల ఉద్యోగ అవసరాలు, స్కిల్స్, ఆర్థిక స్థితి గురించి సమగ్ర సమాచారం సేకరించనుంది. ఈ డేటా ఆధారంగా వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ను మరింత ప్రభావవంతంగా అమలు చేయనుంది. ఇంటి నుంచే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించుకోవడంలో ముందుంది. ఈ సర్వే కూడా ఆ మార్గంలో మరో ముందడుగుగా మారింది. ప్రజల అభిప్రాయాలను సులభంగా మరియు వేగంగా సేకరించేందుకు IVRS టెక్నాలజీ ఉపయోగిస్తోంది. ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్రంలో ఉపాధిని పెంచి, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.