Water Issue: కృష్ణా జలాల వివాదం: ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణ ఆగ్రహం.. చంద్రబాబు కు రేవంత్ సహకారం!!


Chandrababu Faces Criticism Over Water Issue

Water Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిలోని నీటిని ఇష్టారాజ్యంగా మళ్లిస్తోందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏపీ అనుచితంగా నీటిని వాడుకుంటోందని, దీనివల్ల తెలంగాణ రైతాంగానికి సాగు నీరు, తాగునీరు అంకపోవడంతో తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలంగాణ ఆరోపిస్తోంది.

Chandrababu Faces Criticism Over Water Issue

ఈ ఏడాది కృష్ణా నది ద్వారా 850 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసింది. అదనంగా, దాదాపు 1010 టీఎంసీల నీరు రెండు రాష్ట్రాలు వినియోగించేందుకు అందుబాటులోకి వచ్చింది. తాత్కాలిక కోటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అనుకున్న మేరకు నీటిని తీసుకుంది. అంతేకాకుండా, పెన్నా బేసిన్‌లో 350 టీఎంసీలను నిల్వ చేసుకోవడం, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలో 50 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నాయంటే, ఏపీ ఇప్పటికే చాలా నీటిని వినియోగించుకున్నట్టే.

ఈ పరిస్థితుల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టులలో తమ వాటా ఇంకా కావాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై తెలంగాణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణా జలాలను ఏపీ అధికంగా వినియోగించుకుంటున్నప్పటికీ, తెలంగాణ నుంచి వచ్చే ప్రశ్నలను రాజకీయంగా మలిచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణ సమాజం చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. తెలంగాణ రైతాంగాన్ని నీటిలేకుండా వదిలేయడం, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం ఎలా సున్నితమైన అంశమవుతుందో ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండినపుడే నీటిని మళ్లించవచ్చని, ప్రస్తుతం ప్రవాహం తక్కువగా ఉండే సమయంలో ఇష్టానుసారం నీటిని తీసుకోవడం, దానిని సమర్థించుకోవడం అన్యాయమని నీటి నిపుణులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *