
Gold prices: పసిడి ప్రియులకు శుభవార్త. ఇటీవల కాలంలో బంగారం ధరలు (gold prices) విపరీతంగా పెరిగి వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న స్పాట్ గోల్డ్ రేట్లు (spot gold rates), దేశీయంగా పెరిగిన డిమాండ్ ప్రధాన కారణాలు. సెప్టెంబర్ 11న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర లక్ష మార్కును దాటింది.
Gold prices cross one lakh Hyderabad
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర $3,646కు చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు, డాలర్ విలువ పడిపోవడం వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం వైపు ఆకర్షించాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు మరింత ఎగసాయి.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు)పై రూ. 200 పెరిగి రూ. 1,01,300కి చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం రూ. 220 పెరిగి రూ. 1,10,510కి చేరుకుంది. వరుసగా మూడో రోజు కూడా ధరలు భారీగా పెరగడం గమనార్హం.
ఇక వెండి ధరలు మాత్రం కొంత స్థిరంగా ఉన్నాయి. గత రోజు కిలో వెండి రూ. 3,000 పెరిగినా, ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ. 1,40,000 వద్దే ట్రేడ్ అవుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,30,000 వద్ద ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్పులు, డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు మరింత మార్పులు చవిచూడవచ్చు.




















