Sridhar Babu: ఉగాది తర్వాత “ఏఐ సిటీ” నిర్మాణానికి భూమి పూజ
Sridhar Babu: ఉగాది తర్వాత మహేశ్వరంలో “ఏఐ సిటీ” నిర్మాణానికి భూమి పూజ చేస్తామని ప్రకటించారు తెలంగాణా మంత్రి శ్రీధర్ బాబు. “క్లియర్ టెల్లిజెన్స్” ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఉగాది తర్వాత మహేశ్వరంలో “ఏఐ సిటీ” నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.

Groundbreaking ceremony for construction of AI City in Maheshwaram after Ugadi
భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. ఇక్కడే 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామని ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు.
Revanth Reddy: మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీదే అధికారం
ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తెలంగాణ హబ్ గా మారుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
Harish Rao: తెలంగాణ అప్పుల చిట్టా బయటపెట్టిన హరీష్ రావు ?