క్రికెట్ అభిమానులకు ఐసీసీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ వేదికలు ఖరారు అయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఈ మూడు దేశాలు కలిసి ఈ మెగా టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఇది నిజంగా ఆఫ్రికా ఖండంలో క్రికెట్ ప్రాధాన్యతను మళ్లీ నిరూపించే big opportunity. గత కొన్ని రోజులుగా ఈ వేదికల గురించి రకరకాల speculations వినిపిస్తుండగా, చివరికి ICC గురువారం అధికారికంగా అన్ని వివరాలు రిలీజ్ చేసింది.
ODI World Cup 2027 Venues Confirmed
ఈ టోర్నీ మొత్తం 12 నగరాల్లో సాగనుంది, అయితే ఇందులో ఎక్కువ భాగం దక్షిణాఫ్రికాలోనే జరగడం విశేషం. దాదాపు 8 సిటీలు అక్కడివే. జోహన్నెస్బర్గ్, సెంచూరియన్, కేప్ టౌన్, డర్బన్, Gqeberha, బ్లోమ్ఫోంటెయిన్, పార్ల్, కుగోంపో లాంటి టాప్ క్రికెట్ వెన్యూలు ఎంపికయ్యాయి. మిగతా ప్రదేశాల్లో జింబాబ్వే నుంచి హరారే, బులవాయో, విక్టోరియా జలపాతం ఉన్నాయి. నమీబియాలో ఒకేఒక్క నగరం, విండ్హోక్, ఈ ప్రపంచకప్ కోసం రెడీ అవుతోంది. ఇక్కడ మ్యాచ్లు చూడ్డానికి చాలా excited గా ఉన్నారు ఫ్యాన్స్.
ఈ వేదికల selection వెనక కథ ఆసక్తిగా ఉంది. స్టేడియాల నాణ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడి క్రేజ్ ఈ మూడు విషయాలనూ బాగా పరిశీలించి ఈ లిస్ట్ ఫైనల్ చేశారు. దక్షిణాఫ్రికాకు క్రికెట్ పట్ల ఉన్న passion చూస్తే, ఇలా సింహభాగం వారికి లభించడం సహజం. ఈ మెగా టోర్నీ 2027 అక్టోబర్ 4న మొదలై నవంబర్ 21 వరకు రన్ అవుతుంది. మొత్తం 54 మ్యాచ్లు జరుగుతాయి, 14 టీమ్స్ పోటీపడతాయి. అలాగే, ఈ విశేషాన్ని cricinfo తమ సోషల్ మీడియాలో చక్కటి pic తో షేర్ చేసింది.
ఈ ప్రపంచకప్ ఫార్మాట్ మామూలుగానే hectic గా సాగుతుంది. క్వాలిఫై చేసిన 14 జట్లు ఫుల్ ఎనర్జీతో దిగుతాయి. ఫ్యాన్స్ కోసం ప్రతి మ్యాచ్ ఒక feast లాంటిది. అంతిమంగా, విజేత ఎవరనేది తేలే వరకు థ్రిల్ రైడ్ కన్ఫర్మ్. ఈ టోర్నమెంట్ కోసం ఆఫ్రికన్ దేశాలు కొత్తగా చాలా ఏర్పాట్లు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు ఈ లింక్ చెక్ చేయండి:
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





