Team India: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా
Team India: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా…… మంగళవారం రోజున ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ సెమీఫైనల్ లో… అద్భుతంగా ఆడిన టీమిండియా… ఫైనల్ కు చేరింది. ఆస్ట్రేలియా పైన నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.

India thump Australia to reach third consecutive Champions Trophy final
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా…. 49.3 ఓవర్లలో… 264 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా ఆచితూచి ఆడింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అలాగే రోహిత్ శర్మ అందరూ అద్భుతంగా ఆడి… జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఇక మార్చి 9వ తేదీన… ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బుధవారం రోజున సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మరో సెమీఫైనల్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. దీంతో దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ గెలిచిన జట్టు.. మధ్య ఫైనల్ ఉంటుంది.