టాలీవుడ్లో గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్గా మారిన జానీ మాస్టర్ వివాదం చివరకు ఒక కొలిక్కి వచ్చింది. స్టార్ కొరియోగ్రాఫర్పై ఉన్న నాన్ కోఆపరేషన్ ఉత్తర్వును ఫెడరేషన్ పూర్తిగా వెనక్కి తీసుకుంది, దీంతో సెట్స్లో టెన్షన్ వాతావరణం చల్లబడి, మళ్ళీ పనులు సాఫీగా కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది.
Jani Master Issue Resolved Smoothly
పరిశ్రమ అగ్ర నాయకులు చిరంజీవి, బాలకృష్ణ ఈ మొత్తం మ్యాటర్లో చాలా active గా step in అయ్యారు. వాళ్ళు ఇద్దరూ కలిసి జానీ మాస్టర్తో పాటు ఫెడరేషన్ ప్రతినిధులతో విడివిడిగా, కలిపి చాలా రౌండ్ల మీటింగ్లు పెట్టారట. పైగా జానీ తనపై వచ్చిన ఆరోపణల్ని డిటైల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఏమీ దాచకుండా మాట్లాడటంతో ఫెడరేషన్ side నుంచి కూడా ఆయన explanation కి సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అనవసర రాద్ధాంతం ఎందుకని, ఇండస్ట్రీ ప్రతిష్ట దెబ్బతీయడం సరికాదని సీనియర్లు గట్టిగా చెప్పడంతో త్వరగా సెటిల్ అయ్యింది.
ఈ సందర్భంగా డాన్సర్స్ యూనియన్ అంతర్గత issues కూడా డిస్కస్ అయ్యాయి. కార్యవర్గంలో కొందరిపై సస్పెన్షన్ వరకు వెళ్ళిన వివాదాలను ఎలా డీల్ చేయాలనే దానిపై ఒక రూల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, మెజారిటీ ఒపీనియన్ ప్రకారమే డిసిషన్ తీసుకోవాలని డైరెక్టర్ ఫెడరేషన్ నుంచి సూచనలిచ్చారట. అప్పటి వరకు సుమలత దేవి లీడ్లో ఉన్న పాత టీమే కొనసాగుతుంది.
మొత్తంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మేం ఫైట్ చేశామే తప్ప వేరే ఉద్దేశం లేదని సుమలత క్లారిటీ ఇచ్చింది. కార్మికుల వెల్ఫేర్కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ రాజీ సాధ్యమైందని నిర్మాతల మండలి కూడా రియాక్ట్ అయ్యింది. జానీ మాస్టర్ ఇష్యూ ఫైనల్ గా రిజల్వ్ అవ్వడంతో ఇండస్ట్రీలో మళ్ళీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయని అన్ని యూనియన్ల సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.





