‘లగ్గం టైమ్’ షూటింగ్ పూర్తి.. సమ్మర్ కానుకగా విడుదల

’20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణంలో కె.హిమ బిందు నిర్మిస్తున్న రామ్ కామ్ ఎంటర్టైనర్ ‘లగ్గం టైమ్’. రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్. ఇక పవన్ సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఏమైందో గాని’ పాట అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది.
ఇక ‘లగ్గం టైమ్’ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించగా దానికి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక తాజాగా షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. ‘లగ్గం టైమ్’ లో యూత్ ను మాత్రమే కాదు టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని.. సినిమా చాలా బాగా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు. అంతేకాదు సమ్మర్ కానుకగా ‘లగ్గం టైమ్’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని కూడా టీం వెల్లడించనుంది.
టెక్నికల్ టీమ్ :
కథా రచయిత, దర్శకుడు: ప్రజోత్ కె వెన్నం
నిర్మాత: కె. హిమ బిందు
ప్రధాన నటులు: రాజేష్ మేరు, నవ్య చిట్యాల
సహాయ నటీనటులు: నెల్లూరు సుదర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి
మ్యూజిక్ కంపోజర్ : పవన్
సినిమాటోగ్రాఫర్: పవన్ గుంటుకు
ఎఢిటర్ : శివనాథ్ శ్రీరామ్
డిజిటల్ & పిఆర్ఓ : మమత రెడ్డి, ఫణి కుమార్