Congress: నెల రోజుల పాటు.. ఊరూరా కాంగ్రెస్ పండుగ !
Congress: నెల రోజుల పాటు.. ఊరూరా కాంగ్రెస్ పండుగ అని… గ్రామ గ్రామాన సంబరాలు .. నెల రోజుల పాటు సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ లపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని… టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం నిర్వహించి ఆదేశించారు. ఇందులో ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్.. పాల్గొన్నారు. గత రెండు రోజులుగా అసెంబ్లీలో బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నామని తెలిపారు.

Month-long Uroora Congress festival
ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలు.. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో కుల ఘనన జరపలేదని వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు, ఎస్సి వర్గీకరణ కు ఆమోదం తెలిపామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్ లను ప్రకటించి ఇప్పుడు ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పుడు మనం చేసుకున్న రెండు తీర్మానాలు సామాజిక విప్లవానికి పునాదులు పడ్డాయని వెల్లడించారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మంత్రి వర్గం అంత కృషి చేసి బిల్లులను ఆమోదింప జేయడం హర్షించదగ్గ విషయం అన్నారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.
Cm Revanth Reddy: గుమ్మడి నర్సయ్య దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి ?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినపుడు ఎంత సంతోషపడ్డమో ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నామన్నారు. ఇంత సంతోషాన్ని పల్లెల్లో ఇంటికి పంచాలి..పెద్ద ఎత్తున సంబరాలు చేయాలి . నెల రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. అలాగే ఏఐసీసీ ఆదేశాల మేరకు జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని తెలిపారు. ఈ అభియాన్ కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందిస్తామన్నారు. బాణాసంచా కాల్చి, ప్లెక్సీలు పెట్టి, ఇంటింటికి కరపత్రాలు పంచి, ఊర్లలో పండగలాగా సంబరాలు నిర్వహించాలి. స్టేజి మీటింగ్ లు, ప్రెస్ మీట్ లు నిర్వహించాలని స్పష్టం చేశారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. వీటి ప్రాముఖ్యత ను అందరికి తెలియజేయాలి.. ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని వెల్లడించారు.