Telangana Politics : తెలంగాణ సీఎంగా మార్పు ఖాయం.. కాంగ్రెస్ అంతర్గత విభేదాలు.. రాహుల్ గాంధీ కొత్త ఆలోచన!!


Cm Revanth Reddy kodangal Telangana Politics Heats Up Over CM Post

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ, వచ్చే డిసెంబర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుండి తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మార్పు కూడా ఈ మలుపుకు సంకేతమని మహేశ్వర్ రెడ్డి సూచించారు.

Telangana Politics Heats Up Over CM Post

మహేశ్వర్ రెడ్డి ప్రకారం, రేవంత్ రెడ్డి స్థానాన్ని దక్కించుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో లాబీయింగ్‌ జరగడం, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాలు తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పును అనివార్యం చేస్తున్నాయని ఆయన వివరించారు. అలాగే, మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణకు పంపించడం వెనుక కూడా ముఖ్యమంత్రి మార్పుతోనే సంబంధం ఉందని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకువచ్చిన కుంతియాను పక్కన పెట్టి, రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షీని తీసుకువచ్చారని, ఇప్పుడు మళ్లీ ఉత్తమ్ కుమార్ మీనాక్షి నటరాజన్‌ను తీసుకురావడం రేవంత్‌కు మంచి సంకేతం కాదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి పూర్తి మద్దతు కోల్పోతున్నట్లు స్పష్ట సంకేతాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

అంతేకాకుండా, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో విస్తృతంగా లాబీయింగ్ చేస్తూ, వచ్చే రోజుల్లో తమదే ముఖ్యమంత్రి పదవి కావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మార్పు, పార్టీలో అసంతృప్తి పెరగడం, కాంగ్రెస్ భవిష్యత్తు అనిశ్చితంగా మారడం వంటి అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపును తీసుకురావచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *