‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులు
సంగీతం : శ్రీకోటి
ఎడిటర్ : మేనగ శ్రీను
ప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డి
పి ఆర్ ఓ : మధు VR
విడుదల తేదీ: 29 నవంబర్ 2024
సత్యా రెడ్డి తన స్వీయ దర్శక నిర్మాణంలో హీరోగా నటిస్తూ, ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఉప్పు సత్యాగ్రహం’. ఈ సంఘటన ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రూపొందించగా ఈరోజే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో ప్రజా నౌక, గాయకుడు, విప్లవకారుడు గద్దర్, అలాగే పల్సర్ బైక్ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మ శ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్న కుమార్, వెన్నెల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని శ్రీ కోటి అందించగా, ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.
కథ: ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు జరిగినప్పుడు, ఎంతోమంది నాయకులు, ఉద్యమకారులు దాన్ని ఆపేందుకు పోరాడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనల ఆధారంగా, సత్యా రెడ్డి ఈ చిత్రం రూపొందించారు. వైజాగ్లో జరిగిన ఆందోళనలు, ఉద్యమకారుల సహకారం, మల్టీ నేషనల్ కంపెనీల ప్రైవేటీకరణ యత్నాలు, వీటిలో గద్దర్ పాత్ర, ఉద్యమంలో చేసిన కృషి అన్నీ ఈ చిత్రంలో చూపించారు. చివరికి ఎవరి ప్రయత్నం ఫలించింది, ఆ సంఘటనల ప్రభావం సినిమా పై ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పక చూడాల్సిందే.
నటీనటుల నటన: ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సత్యా రెడ్డి సినిమాకే హైలైట్ గా నిలిచారు. తన పత్రలో పూర్తిగా ఒదిగిపోయి ప్రేక్షకుడు తల తిప్పనివ్వకుండా చేశారు. ఆయన నటన దాసరి నారాయణరావు గారిని గుర్తు చేసేలా ఉంది అంటే అతిషయోక్తి కాదు, ఒక ఉద్యమకారుడిగా తన పాత్రకు జీవం పోయడమే కాకుండా ఉద్యమకారుడు ఇలానే ఉంటాడు అనిపించేలా నటించారు. ఎక్స్ప్రెషన్లలోనూ, డైలాగ్ డెలివరీలోనూ ఎక్కడా తగ్గకుండా సత్యా రెడ్డి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ప్రజానౌక గద్దర్ చిత్రానికి కీలక బలం కాగా, ఉద్యమ సన్నివేశాల్లో సత్యా రెడ్డితో కలిసి నటిస్తూ, చిత్రానికి మరింత బలం చేకూర్చారు.అయన ఎనర్జీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమా లో అయన ఎనర్జీ రెట్టింపు గా ఉంది. తక్కువ స్క్రీన్ టైం అనిపించినప్పటికీ గద్దర్ పాత్ర ఎంతో కీలకమైంది. చిత్రానికి కీలక బలం గా నిలిచారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు రాసిన విప్లవాత్మక పాటలు సినిమాకు బోనస్గా మారాయి. ఆ పాటలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తూ, గద్దర్ పాత్రకు మరింత ప్రముఖ్యతాను చేకూర్చాయి. పల్సర్ ఝాన్సీ ఒక పోలీస్ ఆఫీసర్గా, ఉద్యమకారునిగా తన పాత్రకు న్యాయం చేశారు. చిత్రంలో హీరోయిన్ కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు. ఇతర పాత్రధారులందరూ తమ పాత్రలకు తగిన న్యాయం చేస్తూ, చిత్రాన్ని మరింత ఆకర్షనీయం గా తీర్చిదిద్దారు.
సాంకేతిక విశ్లేషణ: యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమా కు స్క్రీన్ ప్లే ఎంతో ముఖ్యం. దాన్ని చక్కగా రాశారు దర్శకుడు. సత్యారెడ్డి దర్శకత్వం, స్క్రీన్ ప్లే బాగా ఆకట్టుకున్నాయి. విశాఖపట్నంలోని నేచురల్ లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల సినిమాకు ఒరిజినాలిటీ వచ్చింది. విప్లవాత్మక డైలాగులు సినిమా బలంగా నిలిచాయి. ముఖ్యంగా గద్దర్ గారి సీన్స్ ఎంతో బలంగా రాసుకున్నారు, డబ్బింగ్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. కెమెరా పనితనం బాగుంది, ఇది చిత్రానికి ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా కు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
కథ
కథనం
గద్దర్ సీన్స్
మైనస్ పాయింట్స్:
కమర్శియాలిటీ మిస్ అవడం
తీర్పు: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో జరిగిన పోరాటాలను యదార్థంగా చూపించిన ఈ చిత్రం గద్దర్ గారి విప్లవాత్మక స్ఫూర్తిని ఆవిష్కరించి నేటి ప్రేక్షకులకు మేటి అనుభవాన్ని ఇస్తుంది.
రేటింగ్ : 3.5/5