Uttam Kumar Reddy: 12 ఎమ్మెల్యేల‌తో ర‌హ‌స్య చ‌ర్చ‌లు…ఉత్తమ్ కుమార్ రెడ్డి పోస్ట్ వైర‌ల్ ?

Uttam Kumar Reddy Secret discussions with 12 MLAs
Uttam Kumar Reddy Secret discussions with 12 MLAs

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టు నేపథ్యంలో మంత్రుల మధ్య గొడవలు చోటు చేసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎన్ టివి అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్స్ లో కూడా ఈ సింగరేణి కాంట్రాక్టర్లపై ప్రత్యేక కథనాలు వెలుపడ్డాయి. భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కాంట్రాక్టుల కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. Uttam Kumar Reddy

Uttam Kumar Reddy Secret discussions with 12 MLAs

అయితే ఏమి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి వర్సెస్ తెలంగాణ మంత్రి వర్గం అన్నట్లుగా రెండుగా కాంగ్రెస్ ప్రభుత్వం చీలిపోయినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగానే భట్టి, ఉత్తంకుమార్ రెడ్డి తో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ఇద్దరు మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఇంటలిజెన్స్ నిగా పెట్టాడట. Uttam Kumar Reddy

Also Read: Naini Coal Mines Tender: క‌థ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…

ఎప్పటికప్పుడు వారి సమాచారం సీఎం రేవంత్ రెడ్డి టీం తెలుసుకుంటుందట. ఈ న్యూస్ ను గులాబీ పార్టీ బాగా వైరల్ చేస్తోంది. అయితే ఈ వార్త బయటకు రాగానే వెంటనే తెలంగాణ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని… కావాలని గులాబీ పార్టీ తమ మధ్య చిచ్చు పెడుతుందని ఫైర్ అయ్యారు ఉత్తంకుమార్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. Uttam Kumar Reddy

Also Read: Naini Coal Mines Tender: క‌థ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…

Share your love