మాల సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించనుంది. ఈ మేరకు మాల సర్పంచులు, కౌన్సిలర్లతో మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు. వారి బాధలను ఆలకించిన ఆయన స్పందించిన తీరు సభలో చర్చనీయాంశమైంది.
మాలలకు జరుగుతున్న అన్యాయం విషయాన్ని తప్పకుండా కేబినెట్ సమావేశంలో ప్రస్తావిస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో మాల ప్రతినిధులకు జరుగుతున్న వివక్ష, వారి హక్కుల ఉల్లంఘనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యలను కేబినెట్ ముందుంచి పరిష్కార మార్గాలు వెతకాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో మాల సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తమకు జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యం గురించి వారు వాపోయారు. ప్రభుత్వ పథకాల అమలులో మాలలను విస్మరిస్తున్నారని, అధికార యంత్రాంగం నుంచి సరైన సహకారం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాత్రం వారికి ధైర్యం చెప్పి, సమస్యలు పరిష్కరించే వరకు తాను వెనక్కి తగ్గబోనని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
మాల సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే కేబినెట్ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి భావిస్తున్నారు. దీంతో ఈ అంశాన్ని కేబినెట్ ఎజెండాలో చేర్చాలని ఆయన నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఈ సమావేశం తర్వాత మాల నేతల్లో ఆశావహ వాతావరణం నెలకొంది. మంత్రి హామీల అమలుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. రాబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది.





anirudh reddy సంచలన కామెంట్స్పై పొలిటికల్ హీట్