Afghan Cricketers: పాకిస్తాన్ బాంబు దాడి…ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట‌ర్లు మృతి ?

Afghan Cricketers: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జ‌ట్టులో పెను విషాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి చెందారు. పాకిస్తాన్ – అఫ్గానిస్థాన్ సరిహద్దులోని పాక్టికా ప్రావిన్స్ ప్రాంతంలో వైమానిక దాడులకు పాల్పడింది పాక్. ఇక ఈ దాడిలో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు, మరో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారు దేశవాళీ క్రికెటర్లు హరూన్, కబీర్, సిబాతుల్లాలుగా గుర్తించారు. Afghan Cricketers

3 Afghan Cricketers Among 8 Dead In Pakistani Airstrike Near Border

వచ్చే నెలలో పాక్, శ్రీలంకతో జరిగే ట్రై నేషన్ సిరీస్‌లో అఫ్గాన్ తరపున జట్టులోముగ్గురు క్రీడాకారులు ఉన్నారు. ఈ దాడి నేపథ్యంలో ట్రై సిరీస్ నుండి తప్పుకున్న అఫ్గానిస్థాన్.. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేసింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ దాడిలో మా ముగ్గురు క్రికెటర్లు మృతి చెందారని పేర్కొంది. Afghan Cricketers

Also Read: Komatireddy Rajgopal Reddy: ఆస్తులు అమ్ముకున్నా.. కాంగ్రెస్ పై రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో బాంబ్…

మొత్తం ఎనిమిది మంది మరణించారని తెలిపింది. చనిపోయిన వారిలో కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హ‌రూర్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలోనే ముక్కోనపు టి20 సిరీస్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. ఆ ట్రై సిరీస్ లో పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలోనే తప్పుకుంటున్నామని వెల్లడించింది. Afghan Cricketers

Also Read: ponnam prabhakar: పొన్నం ప్రభాకర్ ఒక్కడుంటే చాలు.. కాంగ్రెస్ రెండు నిమిషాల్లో భూస్థాపితం ?