

Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. Telangana
Supreme Court issues notice to Telangana Speaker Gaddam Prasad in BRS MLA defection case
స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు వేయడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది బీజేపీ పార్టీ. ఇదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. Telangana
Also Read: Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?
ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. అటు కాంగ్రెస్ పార్టీకి సిగ్గు,శరం ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టండి అంటూ చురకలు అంటించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అప్పుడు ఎవరి గద్దెలను కూల్చాలో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. Telangana
Also Read: Duvvada Srinivas: మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బైక్ రైడ్..అసలేం జరిగిందంటే?







