
Congress: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట దావత్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి అమెరికాకు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. Congress
Congress CM Revanth abroad Secret meeting of four Congress ministers
తెలంగాణ రాష్ట్రంలో రహస్యంగా నలుగురు కాంగ్రెస్ మంత్రులు సమావేశమైనట్లు తెలుస్తోంది. లోక భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం నిర్వహించిన అనంతరం ఒకే కారులో భట్టి విక్రమార్క నివాసానికి తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్ రెడ్డి అలాగే అట్లూరి లక్ష్మణ్ వెళ్లడం జరిగింది. Congress
Also Read: Rajagopal Reddy: వైన్స్ విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి?
రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ నలుగురు దాదాపు 3 గంటల పాటు సమావేశమైనట్టు చెబుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి వర్గంలో కొత్త ఆందోళన నెలకొందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారట. మంత్రులు సమావేశం అయితే తప్పేం లేదని… అది సాధారణ సమావేశం మాత్రమేనని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. Congress
Also Read: TDP: వైసీపీ నాయకులతో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను





