
Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి కండ్లు వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ కు ఓ రేంజ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు కల్వకుంట్ల కవిత. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఇప్పటివరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. అలాంటి నాయకులను దగ్గరకు రానివ్వకూడదని స్పష్టం చేశారు. Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha counter to pawan kalyan
తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతో కోనసీమ పాడైందని పవన్ కళ్యాణ్ ఎలా అంటారని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఏనాడూ దిష్టి పెట్టలేదని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లను క్షమించేది లేదని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు రావాలని కూడా చురకలు అంటించారు. Kalvakuntla Kavitha
Also Read: PM MODI: భారత పౌరులకు బిగ్ షాక్..ప్రధాని మోదీ అతిపెద్ద కుట్ర..?
తెలంగాణ సాధనలో శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని మాటల్లో కొలవలేమని ఈ సందర్భంగా పేర్కొన్నారు కవిత. ఉద్యమకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వివరించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అమరవీరులను తగిన విధంగా గౌరవించలేదని ఆగ్రహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర నాయకుల దిష్టి కళ్ల వల్లే, కోనసీమ నాశనం అయిందని ఫైర్ అయ్యారు. Kalvakuntla Kavitha
Also Read: Komatireddy Venkat Reddy: సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు





