Petrol Crisis: ఏపీలో పెట్రోల్ సంక్షోభం.. లోకేష్ హామీలు మర్చిపోయారా?

లోకేష్ మాటలు కట్ చేస్తే… ఏపీలో పెట్రోల్, డీజిల్ పై షాకింగ్ అప్ డేట్!

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. నడిరోడ్లపై వాహనాలు ఆగిపోవడం, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఇంధన సంక్షోభంపై ప్రజలు మండిపడుతుండగా, ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

చంద్రబాబు సమీక్షలో సోమవారానికి సరఫరా పెంచాలని, నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని సూచించారు. అయితే సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం రాష్ట్రంలో ఇంధన కొరత లేదని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ సంక్షోభం వెనుక కుట్ర ఉందని ఓ వర్గం మీడియా ఆరోపిస్తుండటంతో చర్చ మరింత ముదురుతోంది.

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలు, ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి ఏపీలో మాత్రమే ఉండటం విడ్డూరంగా ఉంది. ఇక విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు ఎప్పటిలాగే ఉండటం ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

తాజా సమీక్షలో సగటు వినియోగం కంటే సరఫరా పెరిగిందని అధికారులు చెప్పినా, ఆచరణలో మాత్రం కొరత కొనసాగుతోంది. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, బాటిళ్లలో డీజిల్ కొట్టాలని కస్టమర్లు అడగడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడొస్తుందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.