
జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ మరోసారి తన బిజినెస్ మైండ్తో అందరినీ షాక్ ఇచ్చారు. టెక్ వరల్డ్లో ఆయన దూసుకుపోతున్న తీరు ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. కేవలం ట్రేడింగ్ యాప్లకే పరిమితం కాకుండా, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద ఆయన భారీగా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టార్టప్స్కు ఎంకరేజ్ ఇస్తూనే, సరికొత్త సెక్టార్ల వైపు అడుగులు వేస్తున్నారు.
nikhil kamath invests in ctrls
తాజాగా బిజినెస్ మ్యాన్ శ్రీరామ్ రెడ్డి వంగాతో కలిసి నిఖిల్ కామత్ చేసిన ఒక డీల్ మార్కెట్లో హాట్ టాపిక్ అయింది. మన దేశంలోనే నెంబర్ వన్ డేటా సెంటర్ కంపెనీ అయిన CtrlS Datacenters లో వీళ్లిద్దరూ కలిసి ఏకంగా 250 కోట్ల రూపాయల ఫండింగ్ అందించారు. ఇందులో ఒక్క నిఖిల్ కామత్ వైపు నుంచే ఏకంగా 200 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం. మిగతా 50 కోట్లను శ్రీరామ్ రెడ్డి సమకూర్చారు.
ప్రస్తుతం జనరేషన్ మొత్తం ఏఐ మరియు క్లౌడ్ టెక్నాలజీ మీద నడుస్తోంది. ఈ ఫ్యూచర్ ట్రెండ్ను ముందే పసిగట్టిన ఈ ఇన్వెస్టర్స్, డేటా స్టోరేజ్ బిజినెస్పై ఫోకస్ పెట్టారు. ఆన్లైన్ డేటా యూెసేజ్ విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, డేటా సెంటర్ల అవసరం చాలా కీలకంగా మారింది. ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్తో తమ హైపర్స్కేల్ డేటా సెంటర్లను మరింత విస్తరించాలని CtrlS ప్లాన్ చేస్తోంది.
నిఖిల్ కామత్ తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్లే ఇండియన్ టెక్ ఎకోసిస్టమ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ రంగంలో ఆయన నుంచి మరిన్ని బిగ్ అనౌన్స్మెంట్లు వచ్చే ఛాన్స్ ఉంది.







