ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భుజానికి 3.5 గంటల సర్జరీ!!

పవన్ ఏళ్ల గాయానికి చివరకు ముంబైలో విజయవంతంగా surgery అయింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి శనివారం ఈ ఆపరేషన్ చేశారు. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ surgery లో కుడి భుజానికి మాత్రమే చికిత్స చేశారు. ఇది పవన్ ఏళ్లుగా భరిస్తున్న నొప్పికి పూర్తి పరిష్కారం కాకపోయినా, మంచి మొదలు అని వైద్యులు చెప్తున్నారు.

2018లో రెండు భుజాలకు గాయాలు అయినా, పవన్ వాటిని ఎప్పుడూ light గా తీసుకోలేదు. రొటేటర్ కఫ్ అనే భాగం దెబ్బతినడంతో ఏళ్ల తరబడి విపరీతమైన నొప్పి ఉండేది. కానీ రాజకీయాలు, పదవి ఒత్తిడి వల్ల surgery ను వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల ముక్కు ఆపరేషన్ సమయంలో వైద్యులు ఈ గాయాలను గుర్తించి, ప్రమాదం వైపు హెచ్చరించారు. అప్పటికీ పవన్ కొన్ని రోజులు వేచి చూశారు, కానీ ఇప్పుడు మాత్రం వైద్యుల advice మేరకు surgery చేయించుకోవాల్సి వచ్చింది.

ఇప్పటి surgery కేవలం కుడి భుజానికి మాత్రమే. ఎడమ భుజానికి రెండు నెలల్లో మరో surgery చేయాల్సి ఉంటుంది. ఒకేసారి రెండు భుజాలకు ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రంగా ఉంటుందని, భరించడం impossible అవుతుందని వైద్యులు నిర్ణయించారు. పవన్ కి ఈ surgery విజయవంతం అయినట్లు వైద్యులు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆయన కోలుకునే దశలో ఉన్నారు.

పవన్ ఏళ్ల గాయానికి సర్జరీ విజయవంతం అయిన వార్త తెలుగు ప్రజల్లో ఆనందం నింపింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, పవన్ త్వరగా కోలుకోవాలని కోరారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ సహా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా తమ సపోర్ట్ తెలియజేశారు. పవన్ కి పూర్తి రికవరీ కోసం అందరూ ఆశిస్తున్నారు.

Share your love