

Telangana: తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు, లిక్కర్ దుకాణాలు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వంలో ఎక్కువగా ఉన్నాయన్న కాంగ్రెస్.. ఇప్పుడు తమ ప్రభుత్వం లో కూడా లిక్కర్ సేల్స్ ను ఎంకరేజ్ చేస్తోంది. ఎన్నికల హడావిడి మొదలయితే ఈ లిక్కర్ అమ్మకాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పట్టణాలలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో… రోజుకు కోట్లల్లో డబ్బుల ముఠాలు ప్రభుత్వానికి వస్తున్నాయి. Telangana
Telangana 8th grade students who went to school drunk
అయితే ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లిక్కర్ దుకాణాలు ఎక్కడపడితే అక్కడ ఉన్న నేపథ్యంలో చిన్న పిల్లలు కూడా తాగేస్తున్నారట. మద్యం తాగి ఏకంగా స్కూల్ కి వెళ్లారట ఎనిమిదో తరగతి విద్యార్థులు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో జరిగినట్లు తెలుస్తోంది. Telangana
Also Read: Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మళ్లీ దోపిడీ షురూ ?
విద్యార్థులు తీసుకువచ్చిన బ్యాగులు తనిఖీ చేయగా మద్యం సీసాలు బయటపడ్డట్ల తేలింది అంటున్నారు. అప్పటికే ఆ కుర్రాళ్ళు బీర్లు తాగి వచ్చినట్లు సమాచారం. పాఠశాల సమీపంలో బెల్ట్ షాపు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు.. లిక్కర్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. లిక్కర్ దందా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు జనాలు. Telangana
Also Read: KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో కేసీఆర్ షాక్, రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా ?







