

Telangana: సింగరేణిపై మరో కుట్ర జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రం చేతిలోకి సింగరేణి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికే సింగరేణిని కేంద్రం చేతిలో పెట్టే విధంగా కాంగ్రెస్ సర్కారు అడుగులేస్తున్నట్లు బీఆర్ ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అదే జరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరహాలో సింగరేణి సంస్థ ప్రయివేటీకరణకు లైన్ క్లియర్ కానుందని అంటున్నారు. Telangana
Telangana Another conspiracy against Singareni Powers in the hands of the Center
తెలంగాణ బొగ్గు గనులు సింగరేణికి కాకుండా ప్రైవేటు వారికి కేంద్రం కట్టబడుతుందని గులాబీ పార్టీ స్పష్టం చేస్తోంది. గతంలో తెలంగాణ బొగ్గు గనుల ఆక్షన్ పై వ్యతిరేకించి, గెలిచాక రేవంత్ సర్కార్ మద్దతిస్తున్నట్లు గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడకుండా బొగ్గు బ్లాక్ టెండర్ల కోసం కొట్టుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. Telangana
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు షాక్.. కేంద్రానికి సంచలన లేఖ ?
నైనీ బొగ్గు బ్లాక్ గని కాంట్రాక్టు వ్యవహారంలో నిబంధనలు పక్కన పెట్టి కొత్త షరతులు తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. బొగ్గు గనితో సొమ్ము చేసుకోవడానికి మీడియాను అడ్డం పెట్టుకొని మంత్రులు కొట్టుకున్నారని గులాబీ పార్టీ మండిపడుతోంది. వ్యవహారం బయటకి పొక్కడంతో అప్పటికప్పుడు నైనీ టెండర్లు రద్దు చేసింది ప్రభుత్వం. మరోవైపు సింగరేణి నిధులను ఇష్టాను రీతిలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది గులాబీ పార్టీ. Telangana
Also Read: Kavitha: కవిత-ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ ?







