కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియాలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు అర్బన్ నక్సల్స్ జర్నలిజం, మేధావుల ముసుగులో సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
bandi sanjay targets urban naxals
తన ప్రసంగంలో బండి సంజయ్ మాట్లాడుతూ, సోషల్ మీడియా ద్వారా సనాతన ధర్మాన్ని కించపరిచే వారిని ఉపేక్షించకూడదని అన్నారు. తెలుగు సమాజంలో సంస్కృతిని రక్షించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాను సమర్థవంతంగా నియంత్రించడాన్ని ఆయన అభినందించారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఇలాంటి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. సోషల్ మీడియా నియంత్రణపై మరింత దృష్టి పడే అవకాశం ఉంది.





