NEET paper leak కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన టైంలో ప్రధాని మోదీ అర్థరాత్రి సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. రాళ్లను మెట్లుగా మార్చడం అంటే ఇదేనేమో అంటూ బీజేపీ నేతలు ఈ వీడియోను సెలబ్రేట్ చేస్తున్నారు. కేవలం 24 గంటల్లోనే 303 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం, ప్రధాని ఇన్స్టాగ్రామ్కు లక్షలాది కొత్త ఫాలోవర్స్ రావడం ఈ వీడియో ఇంపాక్ట్ను చూపిస్తోంది.
PM’s Midnight Selfie Video
విమర్శలను అవకాశంగా మార్చుకున్న మోదీ, ఈ మిడ్నైట్ సెల్ఫీతో తాను ప్రజల్లో మమేకం అవుతున్నట్లు చూపించారు. సాధారణంగా ప్రధాని ఏదైనా ప్రకటన చేయాలంటే పీఎంఓ ముందుగా సమాచారం ఇస్తుంది. కానీ ఈసారి ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కసారిగా వీడియో రిలీజ్ చేయడం విశేషం. మీడియాలో ప్రత్యక్షంగా మాట్లాడరనే విమర్శలు వస్తున్న టైంలో ఈ వీడియో రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొదటి వీడియోకు భారీ స్పందన వస్తుండటంతో మోదీ రెండో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇందులో విద్యార్థులకు థాంక్స్ చెబుతూ మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి, మన బంధం ఎప్పటికీ పటిష్టంగా ఉంటుంది అని పేర్కొన్నారు. అలాగే సలహాలు, సూచనలు పంపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు వీడియోలకు కోటిన్నరకు పైగా లైక్లు, 10 లక్షలకు పైగా కామెంట్లు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మోదీ ఈ సెల్ఫీ వీడియోను ఒక స్మార్ట్ పాలిటికల్ స్ట్రాటజీగా విశ్లేషకులు భావిస్తున్నారు. NEET paper leak వంటి సెన్సిటివ్ ఇష్యూపై నేరుగా ఫేస్ చేయకుండా ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడం, వైరల్ అవడంతో ప్రధాని ఇమేజ్కు కొత్త రంగు వచ్చినట్లు బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.





