తిరుపతి నియోజకవర్గం నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రిటైర్మెంట్ ప్రకటితారా అనే ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుంటారంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ విషయంపై ఆయన ఇంకా స్పందించలేదు. పార్టీ లోపలా, బయటా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Arni Srinivasulu retirement update news
ఆయన రిటైర్మెంట్ కు ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. మొదటిది ఆరోగ్య సమస్యలు. గత ఏడాదిగా ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఓ ఆపరేషన్ కూడా చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు ఆరు నెలలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ టైంలో ఆయన బాధ్యతలను అన్న కుమారులకు అప్పగించారనే చర్చ సాగింది. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందంటున్నా, ఈ పరిణామాలు రిటైర్మెంట్ నిర్ణయానికి దారితీస్తున్నాయనే అర్థం వస్తోంది.
రెండో కారణం పార్టీలో సఖ్యత లేకపోవడం. పార్టీలో కొందరు నేతలు ఆయన వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారని, స్థానికంగా అందుబాటులో లేరంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఆరణి మాత్రం తనకు వారు అందుబాటులో లేరని కౌంటర్ ఇస్తున్నారు. ఇది టీకప్పులో తుఫాను అనుకుంటున్నా, ఎన్నికలపై ప్రభావం చూపించే chance ఉంది. ఈ రెండు కారణాలతోనే కాకుండా స్థానిక టీడీపీ నేతలతో కూడా సమన్వయం సరిగా లేదన్న చర్చ సాగుతోంది.
టీడీపీ నేతలు ఓ సమావేశంలో ఈ సీట్ నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్టు బయటపెట్టారు. ఇది కూడా ఆరణికి ఇబ్బందిగా మారింది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి తప్పుకొనే ఆలోచనలో ఉన్నట్టు తన వర్గానికి చెప్పారని సమాచారం. అన్న కుమారుడికి ప్రాతినిధ్యం ఇవ్వాలంటూ సూచనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదంతా చర్చల దశలోనే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.





