Congress: బొగ్గు స్కాం ర‌చ్చ‌…రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు, భ‌ట్టిపై వేటు ప‌క్కా ?

Congress
Congress

Congress: బొగ్గు స్కాం వార్త‌ల నేప‌థ్యంలో ఢిల్లీకి రండి అంటూ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై క‌మాండ్ పిలుపునిచ్చింద‌ట‌. తెలంగాణలో జరుగుతున్న బొగ్గు స్కాం, HILTP స్కాం వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు ఢిల్లీకి రమ్మని హైకమాండ్ ఆదేశాలు పంపింద‌ని అంటున్నారు. Congress

Congress Revanth Reddy gets a call from Delhi

ఈ త‌రుణంలోనే, ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ పెద్దలు భేటీ అయ్యే అవకాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. సింగరేణి- నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ స్కాం, HILT స్కాం వంటి వివాదాలపై రేవంత్ రెడ్డికి కాల్ చేసిన‌ట్లు స‌మాచారం. మంత్రుల మధ్య చెలరేగుతున్న వివాదాలు, మంత్రులపై న్యూస్ ఛానెళ్లలో ప్రసారమయ్యే వివాదాల పై హైకమాండ్ అసంతృప్తిగా ఉంది అని అంటున్నారు. Congress

Also Read: Rajagopal Reddy: వైన్స్ విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి?

తెలంగాణలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, పరిస్థితులు అదుపు తప్పకముందే నియంత్రణలో పెట్టాలని హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంద‌ని అంటున్నారు. తెలంగాణలో స్కాంలపై, వివాదాలపై హైకమాండ్ దృష్టికి కాంగ్రెస్ కు చెందిన‌ సీనియర్ నాయకులు జార వేశార‌ట‌. అంతేకాదు భ‌ట్టి విక్ర‌మార్కపై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై వేటు ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. Congress

Also Read: TDP: వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద ప‌డేస్తాను

Share your love