కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది యువత మరియు విద్యార్థుల సంయుక్త పోరాటానికి దక్కిన పెద్ద విజయం అని BRSV నేత నెమ్మాది శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణిచివేయాలనుకుంటే అది తప్పు పద్దతి అని తేల్చారు. ఇంతకాలం నుంచి విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సర్కారు చివరికి తలొంచాల్సి వచ్చిందని శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
BRSV leaders praise student victory
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP), తెలంగాణలో BRSV చేసిన ఆందోళనలతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులు నిర్వహించిన నిరసనల ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, వారి హక్కుల్ని కాళ్ళకింద పెట్టుకోవడం చివరకు ప్రభుత్వానికే నష్టంగా మారిందని శ్రావణ్ కుమార్ అన్నారు. యువత భవిష్యత్తుతో ఆటలకు దిగితే దానికి సమాధానం తప్పక వస్తుందనే message ను ఈ ఉద్యమం ఇచ్చిందని ఆయన చెప్పారు.
ప్రధాని మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపై లాఠీచార్జిలు, హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మన దేశ యువత సాధించిన గొప్ప విజయం అని కొనియాడారు. యువతరం ఈ దేశాన్ని మార్చుకోగలదు, వారికి పట్టుదలుంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. స్వరం మారుతుంది, నవతరం మారుతుంది, రాజ్యమా ఉలికిపడు అనే నినాదంతో గర్జించిన యువతరానికి పాదాభివందనాలు అని అన్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి శ్రావణ్ కుమార్ హెచ్చరికలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యవతలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుందని, రాబోయే రోజుల్లో జెన్ జీ ఆగ్రహానికి సీఎం గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని శ్రావణ్ కుమార్ అన్నారు.





