Mahesh Babu Impressive Look in Rajamouli's Movie

Mahesh Babu Impressive Look in Rajamouli’s Movie

Mahesh Babu టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu ) మొదటిసారి నటించబోతున్న పాన్ ఇండియా చిత్రం గురించి అందరి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు వేరే భాషలో నటించని మహేష్ బాబు.. మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటించబోయే సరికి అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన తన 29వ సినిమాగా రాజమౌళితో యాక్షన్ అడ్వెంచర్ మూవీని చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గ్లోబల్ లెవెల్ లో ఎంతో హైప్ నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీ స్థాయిలో పారితోషకం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు రూ.80 కోట్లకే తన పారితోషకాన్ని పరిమితం చేసిన మహేష్ బాబు ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా రూ .110 కోట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం.

Also Read : BiggBoss 7 : అనూహ్యంగా ఇంటి నుంచి శివాజీ ఔట్.. కారణం..?

రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో సినిమా అంటేనే ఆడియన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు సినిమా సినిమాకి మహేష్ బాబు కూడా తన పారితోషకాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు.గతంలో సరిలేరు నీకెవరు సినిమా కోసం రూ.40 కోట్లు అందుకున్న ఈయన సర్కారు వారి పాట సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా కోసం రూ .78 కోట్లు తీసుకుంటూ ఉండగా రాజమౌళి సినిమా కోసం ఏకంగా రూ.110 కోట్లు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Mahesh Babu

ఏది ఏమైనా మహేష్ బాబు రేంజ్ సినిమా సినిమాకి మారిపోతోంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే రాజమౌళి కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉండగా.. మరొకవైపు వచ్చే ఏడాది సెట్ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తో రెండు మూడు ఆస్కార్ అవార్డులను కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు రాజమౌళి. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp