
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్కు సంబంధించి ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ వైరల్ అవుతోంది. రీసెంట్గా ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనగా ఈడీ అధికారుల ముందుకు విచారణకు హాజరవడం టాలీవుడ్లో బ్రేకింగ్ న్యూస్గా మారింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారనే allegations పై హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్లో అధికారులు ఆమెను క్వశ్చన్ చేశారు.
nidhhi agerwal ed questioning update
ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో మనీలాండరింగ్ కోణం ఉండటంతో అధికారులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా నిధి అగర్వాల్కు ఎంత రెమ్యునరేషన్ అందింది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయనే విషయాలపై ఆఫీసర్లు కూలంకషంగా ఆరా తీశారు. ఆమె బ్యాంక్ ఎకౌంట్స్ వివరాలను కూడా చెక్ చేసినట్లు తెలుస్తోంది.
కేవలం నిధి అగర్వాల్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా దాదాపు 29 మంది సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ గేమింగ్ ప్లాట్ఫారమ్స్ ప్రమోషన్స్ వివాదంలో ఉన్నారు. వీరందరి పాత్రపై కూడా దర్యాప్తు సంస్థ నజరా పెట్టింది. బెట్టింగ్ యాప్స్ యాజమాన్యంతో ఈ సెలబ్రిటీలు కుదుర్చుకున్న లీగల్ అగ్రిమెంట్స్ డాక్యుమెంట్లను అధికారులు వెరిఫై చేస్తున్నారు.
ఈ హై-ప్రొఫైల్ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సెలబ్రిటీలు ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల కామన్ పీపుల్ ఎక్కువగా మోసపోతున్నారని, అందుకే ఈ ఇష్యూని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుందని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్గా రివీల్ కానున్నాయి.







