
Gudem Mahipal Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. వాళ్లపై ఎప్పుడు వేటు పడుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. సుప్రీంకోర్టు మాత్రం దీనిపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. Gudem Mahipal Reddy
Patancheru MLA Gudem Mahipal Reddy’s key comments
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఓటు వేయాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. తాజాగా మరోసారి బహిరంగ సభలో మాట్లాడుతూ.. గులాబీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Gudem Mahipal Reddy
Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్కు భారీ జరిమానా?
గత కొంతకాలంగా గులాబీ పార్టీ వైపు మహిపాల్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ తో మహిపాల్ రెడ్డి సోదరుడు సమావేశం కూడా అయ్యారు. ఆయన సమయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ గులాబీ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా గులాబీ పార్టీలోకి వెళ్ళబోతున్నారట. Gudem Mahipal Reddy
Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం




















