
PCB Chief Mohsin Naqvi: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో ఇప్పటివరకు టీమిండియా కు.. టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీ దక్కలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ నఖ్వీ ఉన్న నేపథ్యంలో అతని చేతిలో మీదుగా ట్రోఫీని అందుకోకుండా దుబాయ్ నుంచి వచ్చేసింది టీమిండియా.
PCB Chief Mohsin Naqvi not afraid of BCCI
అయితే ఇండియాకు టీమిండియా వచ్చి దాదాపు నాలుగు రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆసియా కప్ ట్రోఫీని అందించలేదు మొహ్సిన్ నఖ్వీ. తన దగ్గర పెట్టుకొని నాటకాలు ఆడుతున్నాడు. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.
Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 లక్షల కారుతోనే
ట్రోఫీ ఇవ్వకపోతే టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటు ఆడకుండా చేస్తామని బిసిసిఐ వార్నింగ్ ఇచ్చినా కూడా నక్వి తగ్గడం లేదు… సూర్య కుమార్ వచ్చి… తన ఆఫీసులో ఉన్న ట్రోఫీని తీసుకువెళ్లాలని చురకలాంటిస్తున్నాడు మొహ్సిన్ నఖ్వీ. దీంతో ఈ విషయంపై ఐసీసీ చైర్మన్ జైషా కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ట్రోఫీ ఇవ్వకపోతే మీ అంత చూస్తామని జైషా కూడా వార్నింగ్ ఇచ్చాడట.
Also Read: Sprouts: మొలకలను ఏ సమయంలో తినాలి…అతిగా తింటే ప్రమాదామా…ఇవి తెలుసుకోండి?




















