Mahasena Rajesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ ఇచ్చాడు మహాసేన రాజేష్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉంటూనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా మహాసేన రాజేష్ విడుదల చేసిన ఓ వీడియో పెను ప్రకంపనాలు సృష్టిస్తోంది. జనసేన పార్టీ నేతలను ఓడించాల్సిందేనని మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. Mahasena Rajesh

Mahasena Rajesh who became Pawan Kalyan’s villain

దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు మూడు పార్టీలు జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీలు ఏకమైన సంగతి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సింది పోయి… ఈ మూడు పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం మూడు పార్టీల నేతల మధ్య వివాదం రాజుంటోంది. Mahasena Rajesh

Also Read: Chiranjeevi: పవన్ కళ్యాణ్ కోసం చిరు…పిఠాపురంలో జనసేన విజయం సాధిస్తుందా ?

అయితే ఇందులో మహాసేన రాజేష్ మరో అగ్గిపుల్ల వేసి ఆ మంటను మరింత ఎక్కువ చేశాడు. భారతీయ జనతా పార్టీకి 400 ల ఎంపీ సీట్లు రావాలని పవన్ కళ్యాణ్ కోరారు. అయితే దళితులను మంచి వేస్తున్న బిజెపికి పవన్ కళ్యాణ్ ఇలా సపోర్ట్ చేయడం మహాసేన రాజేష్ కు అస్సలు నచ్చలేదట. దీంతో ఏపీలో పవన్ కళ్యాణ్ ఉండకూడదనే నేపథ్యంలో రాజేష్ మహాసేన కీలక వ్యాఖ్యలు చేశారు. Mahasena Rajesh

ఏపీలో పవన్ కళ్యాణ్ కంటే జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్ అన్నారు. ఎక్కడైతే జనసేన అభ్యర్థులు ఉంటారో… ఆ చోట్ల… వారిని ఓడించాలని పిలుపునిచ్చారు టిడిపి ఇన్చార్జ్ మహాసేన రాజేష్. జనసేనతో పొత్తు వల్ల టిడిపి గ్రాఫ్ తగ్గిపోయిందని… వారితో పొత్తు లేకుంటే 144 ఎమ్మెల్యేలు గెలిచే వాళ్ళమన్నారు. దీంతో కూటమిలో పెను ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి.

తాజాగా మహాసేన రాజేష్ చేసిన ఈ ప్రకటనతో తెలుగుదేశం కూటమికి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ముందుగానే ఓడిపోతామని గ్రహించి… పవన్ కళ్యాణ్ పై ఆ నిందలు వేస్తోందని టిడిపి పై వైసీపీ పోస్టులు పెడుతోంది. అందుకే మహాసేన రాజేష్ ఇలాంటి వీడియోలు చేస్తున్నాడని వైసిపి సెటైర్లు పేల్చుతోంది. Mahasena Rajesh

Join WhatsApp