Sharmila’s huge sketch to defeat Revanth in Kodangal
Ys Sharmila : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో భారత రాష్ట్ర సమితి, బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు గ్రౌండ్ స్థాయిలో ప్రచారాన్ని ఇప్పటికే మొదలుపెట్టాయి. వరుసగా బహిరంగ సభలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నాయి అన్ని పార్టీలు. జాతీయ పార్టీలైతే జాతీయ నాయకులను రంగంలోకి దీనికి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.
ఇక ఇటు గులాబీ పార్టీ మాత్రం.. సీఎం కేసీఆర్ ను నమ్ముకుని… రోజుకు రెండు బహిరంగ సభల చొప్పున నిర్వహించుకుంటూ ముందుకు సాగుతోంది భారత రాష్ట్ర సమితి పార్టీ. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. భారత రాష్ట్ర సమితి పార్టీకి మరియు షర్మిల పార్టీకి రేవంత్ రెడ్డి ఫోకస్ అయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ALSO READ : Revanth Reddy : నోట్ల కట్టలకు సీట్లు అమ్ముతున్న రేవంత్ రెడ్డి.. బయట పడ్డ సంచలన నిజం..!!
2018 అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. అయితే ఓడిపోయిన చోటే ఈసారి మళ్లీ గెలవాలని రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అలాంటి రేవంత్ రెడ్డి ఆలోచనలను దెబ్బతీసేందుకు వైయస్ షర్మిల భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం కాకుండా ఆపింది రేవంత్ రెడ్డి అని.. ఓ ఆలోచనకు వచ్చిన వైఎస్ షర్మిల… ఎలాగైనా అతన్ని కొడంగల్ నియోజకవర్గంలో ఓడించాలని నిర్ణయం తీసుకుందట.
ఇందులో భాగంగానే… కొడంగల్ నియోజకవర్గం లో వైయస్ఆర్ మరియు క్రిస్టియన్ అభిమానులను ఆకట్టుకునేలా ప్లాన్ వేశారట. కొడంగల్ నియోజకవర్గంలో తన భర్త అనిల్ ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారట షర్మిల. కొడంగల్ నియోజకవర్గంలో వైయస్ అభిమానులు, క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఓట్లను తన వైపునకు లేకుంటే… రేవంత్ రెడ్డి ఓడిపోతారని షర్మిల డిసైడ్ అయ్యారట. అంటే ఈ లెక్కన కొడంగల్ నియోజకవర్గంలో ఇన్ డైరెక్టుగా భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గెలిచేలా షర్మిల ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ( Ys Sharmila )