Robin Uthappa: 2027 వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల కుర్రాడా?

Rohit Kohli ODI end speculation grows

ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా 2027 వన్డే వరల్డ్ కప్ గురించే జోరుగా డిస్కషన్ నడుస్తోంది. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా హోస్ట్ చేయబోయే ఈ మెగా టోర్నమెంట్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ, అప్పుడే తుది జట్టు ఎంపికపై అందరిలో క్యూరియాసిటీ మొదలైపోయింది. ముఖ్యంగా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇమేజినరీ స్క్వాడ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

robin uthappa 2027 wc squad

ఈ ఊహాజనిత జట్టులో ఊతప్ప తీసుకున్న కొన్ని నిర్ణయాలు క్రికెట్ ఫ్యాన్స్ కి నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ఒకవైపు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులో కొనసాగించాలని చెప్పిన ఆయన, మరోవైపు జస్ట్ 15 ఇయర్స్ ఏజ్ ఉన్న వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు కల్పిస్తానని షాకిచ్చాడు. ఈ విధంగా ఒకే టీమ్ లో సీనియర్ లెజెండ్స్ తో పాటు టీనేజ్ కిడ్ కి ప్లేస్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఫ్యూచర్ టీమిండియాను బిల్డ్ చేసే ప్రాసెస్ లో భాగంగా యంగ్ టాలెంట్ కి అర్లీ స్టేజ్ నుంచే ఛాన్స్ ఇవ్వాలని ఊతప్ప స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఏజ్ గ్రూప్ క్రికెట్ లో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ నేషనల్ టీమ్ లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారినప్పటికీ, ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సరికొత్త హిస్టరీ క్రియేట్ అవ్వడం పక్కా అని చెప్పొచ్చు.

రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్స్ గైడెన్స్ యంగ్ స్టర్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రాబోయే టోర్నమెంట్స్ కోసం సెలెక్టర్లు ఎలాంటి అగ్రెసివ్ అప్రోచ్ తో టీమ్ ను రెడీ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి రాబిన్ ఊతప్ప కట్టిన ఈ ప్రొడెక్టెడ్ స్క్వాడ్ సెలెక్టర్లకు ఒక మంచి థాట్ ప్రాసెస్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu