
Soundarya: సౌందర్య మరణాన్ని తలుచుకొని ఇప్పటికి బాధపడే సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఆమెతో సన్నిహితంగా మెదిలిన వారి నుండి మొదలు ఆమెతో సినిమాలు తీసిన ప్రతి ఒక్కరూ ఆమె మరణాన్ని తలుచుకొని ఇప్పటికీ బాధపడేవారు ఉన్నారు. అయితే అలాంటి సౌందర్య మరణం గురించి తాజాగా సెన్సేషనల్ కామెంట్లు చేసింది నటి రాశి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య నేను కలిసి పోస్ట్ మెన్,మూడు ముక్కలాట వంటి సినిమాల్లో చేశాము.
The heroine is getting marriage Meanwhile Soundarya dies
అయితే సౌందర్య నాకంటే ముందే ఇండస్ట్రీకి వచ్చారు.ఆ సమయంలో చాలామంది సౌందర్య దగ్గర పనిచేసే వాళ్లు మా మేడం ని ఇండస్ట్రీలో కొట్టేవారు ఎవరూ లేరు అనుకున్నాము. కానీ ఇప్పుడు మీ మేడం వచ్చిందంటగా అని చెప్పేవారట. అలాగే సౌందర్య తో నేను సినిమాలు చేసినప్పుడు ఆవిడకి నాకు రూమ్ ఎదురెదురుగా ఇచ్చారు.చాలాసార్లు నాతో సౌందర్య చాలా ప్రేమగా మాట్లాడేవారు. చెల్లి చెల్లి అని ఎంతో ఆప్యాయంగా పిలిచేది.(Soundarya)
Also Read: Sai Pallavi: ఛీ ఛీ సాయి పల్లవికి సిగ్గు లేదా.. చెప్పేవి నీతులు చేసేవి చిల్లర పనులు.!
ఇక తెల్లవారితే నా పెళ్లి అనగా సౌందర్య మరణ వార్త వినిపించింది. సౌందర్య మరణించింది అని తెలియడంతో చాలా బాధనిపించింది.నేను నా పెళ్లి సమయంలో ఇండస్ట్రీ నుండి పిలవాలి అనుకున్న ఏకైక వ్యక్తి ఆవిడే. కానీ అలాంటి ఆవిడ ఇప్పుడు లేదని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇక నన్ను పెళ్లి కూతుర్ని చేసిన నెక్స్ట్ డే ఆమె చనిపోవడంతో చివరి చూపు చూసుకోవడానికి కూడా నేను వెళ్లలేదు.

అలాగే ఆవిడ మరణించడంతో సంతాప సభ పెట్టారు ఇండస్ట్రీ వాళ్ళు. ఆ సభకి నేను వెళ్తానంటే మా ఇంట్లో వాళ్లు నో చెప్పారు. ఎందుకంటే పెళ్లికూతుర్ని చేశాక బయటకు వెళ్లొద్దని.కానీ ఆమెని చివరి చూపు చూడ్డానికి వెళ్ళలేదు కనీసం సంతాప సభ కైనా వెళ్ళనివ్వండి అని బెంగళూరు వెళ్లానంటూ సౌందర్య మరణాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది రాశి.(Soundarya)



