“పెద్ది” ఆఫర్ వదులుకున్న మలయాళ హీరోయిన్

రామ్ చరణ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇలాంటి క్రేజీ మూవీకి నో చెప్పిందట మలయాళ నటి స్వసిక. ఈ విషయాన్ని స్వయంగా స్వాసికనే బయటపెట్టింది. ఇంతకీ కారణం ఏంటంటే.. ఇందులో చరణ్‌ తల్లి పాత్ర కోసం స్వాసికను కాంటాక్ట్ చేశారట. అయితే.. చరణ్‌ కు తల్లి పాత్రలో నటించేందుకు తాను సిద్దంగా లేనని చెప్పి సున్నితంగా ఈ ఆఫర్ కు నో చెప్పిందట.

ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో పెద్ది సినిమా పై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మార్చి 27న పెద్ది మూవీ రిలీజ్ కానుంది.

Share your love