గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ

30 ఏళ్లకు పైగా అమెరికాలో ఇండియా డే పెరేడ్ నిర్వహిస్తూ ఖ్యాతి పొందింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్. వీరు ఈ ఏడాది 43వ ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి గ్రాండ్ మార్షల్ గా హీరో విజయ్ దేవరకొండ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు మాడిసన్ అవెన్యూలో పరేడ్ వేడుకలకు గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. 6 లక్షల మంది సమక్షంలో ఘనంగా ఈ వేడుకలు జరగనున్నాయి.

పహాల్గాం ఉగ్రవాదుల దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు నివాళులు అర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది.

Share your love